Thursday, June 19, 2008

తెలుగుదేశం పిల్లిమొగ్గలు - కొత్తపల్లి జయశంకర్‌

తెలంగాణపై తెలుగుదేశం వేస్తున్న పిల్లిమొగ్గల పరంపరలో కోర్‌ కమిటీ నియామకంతో మరో ప్రహసనం మొదలయింది. 2004 సార్వత్రిక ఎన్ని కలలో సమైక్యాంధ్ర నినాదమే తన ప్రధాన అజెండాగా ప్రకటించి, చావు దెబ్బ తిన్న తరువాత తెలుగుదేశం పార్టీ మాట మార్చింది. సరైన సమయంలో సరి యైన నిర్ణయం తీసుకుంటామని కొత్త పల్లవి అందుకున్నది. అదిప్పుడు ఒక అరిగి పోయిన రికార్డు. ఇంతలో ఉప ఎన్నికలు వచ్చాయి. మాట మళ్లీ మార్చి, ఆ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని నమ్మ బలికింది.

ఎన్నికలలో పాల్గొన్న చాలామంది సీనియర్‌ నేతలు ప్రత్యేక రాష్ట్ర సాధనకు కట్టుబడి ఉన్నామని పదే పదే వక్కాణించి నారు. దీనితో కొందరు తెలంగాణ ఓటర్లు ప్రభావితమై, తెలుగు దేశం పార్టీని నమ్మి, ఆ పార్టీ అభ్యర్థులు కొందరిని గెలిపించినారు. ఉప ఎన్నికల దుమారం సద్దుమణగ క ముందే తెలుగుదేశం తిరిగి మాట మార్చింది. తెలంగాణకు వ్యతిరేకం కాదు అన్నంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర స్థాపనకు సమ్మతించడం కాదని ఆ పార్టీ అగ్ర నాయకులే భాష్యాలు చెప్తున్నారు.

ఈ వక్ర భాష్యాలను చంద్రబాబు నాయుడు ఖండించక పోగా, సమర్థిస్తున్న సంకేతాలు పంపుతున్నారు. కోర్‌ కమిటీ పేరుతో ఇప్పుడు మరో ప్రహసనం మొదలయింది. ముందు ఇది కేవలం తెలంగాణ అంశా న్ని పరిశీలించడానికి వేస్తున్నట్లు తెలిపినారు. ఇప్పుడు తెలంగాణతో పాటు భూమండలంపై ఉన్న అనేకానేక అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని అంటు న్నారు. కనీసం తెలంగాణకు సంబంధించిన చర్చనీయాంశాల గురించి కూడా ఏ స్పష్టత లేదు. అసలు కోర్‌కమిటీ సభ్యుల ఎంపికలోనే తెలంగాణ వ్యతిరేక భావన స్ఫురిస్తున్నది.

ఐదుగురిలో నలుగురు విశాలాంధ్ర వాదులు. ఈ కమిటీ తొలి సమా వేశానికి కమిటీ సభ్యుడు కాకపోయినా చంద్రబాబు నాయుడు స్వయంగా అధ్యక్ష త వహించడం ప్రహసనంలో ఉప ప్రహసనం. ఇక ఈ కమిటీ పరిశీలించబోయే అంశాల గురించి చర్చిద్దాం. ముందుగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలు తెలుసుకుంటారట. దీనికి ఏ పద్ధతి అవలంభిస్తారు? ఒపీనియన్‌ పోల్‌ జరుపుతారా? ప్లెబిసైట్‌ లేక రెఫరెం డం నిర్వహిస్తారా? ఇది ఏదైనా సాధ్యమేనా? నిజానికి ఇతర ప్రాంతా ల ప్రజల మనోభావాలు తెలుసుకొనే అవసరం ఇంకా ఉందా?

2004 ఎన్నికలలో సమైక్యాంధ్ర నినాదంతో ఎన్నికల బరి లోకి దిగిన తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజ లు కూడా తిరస్కరించలేదా? దీనితో ఇతర ప్రాంతాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకులు కారనే సంకేతాలు రాలేదా? ఇంకా ఎవరి అభిప్రాయం కావాలి? రాజ్యాధికారమే పరమావధిగా ఉన్న చంద్రబాబునాయుడు, రాజశేఖర రెడ్డి వంటి వారి అభిప్రాయమా? హైదరాబాద్‌ స్థానికుల జీవితాలను దుర్భరం చేసి న రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్ల అభిప్రాయమా? పెట్టుబడులపేరుతో పెత్తనం చలా యించే ఆంధ్ర ప్రాంత సంపన్నవర్గాల అభిప్రాయమా?

ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులు విడిపోయినప్పుడు, తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా ఆంధ్ర లో విలీనం చేసినప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నారు? అంతెందుకు, భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడినప్పుడు బ్రిటిష్‌ పాలకుల అభిప్రాయాలు అడిగినా మా? ఇప్పుడు కడుపునొప్పితో ఒకడు వైద్యుని వద్దకు పోతే ముందు పక్కింటి వానికి వైద్య పరీక్షలు చేస్తానన్న చందంగా ఉంది తెలుగుదేశం సరళి. టీడీపీకి 119 మంది శాసనసభ్యులు గల తెలంగాణ ప్రాంతం కన్నా 175 మంది శాసనసభ్యులు ఉన్న ఇతర ప్రాంతాలు ముఖ్యమని బాహాటంగానే అంటు న్నారు.

ఏ విధంగానైనా ఎక్కువ సీట్లు సంపాదించి, చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడం తప్ప, వారికి వేరే అజెండా లేనట్టుంది. రాజ్యాధి కార రేసులో తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ప్రాంత సమస్యలు, ఇక్కడి ప్రజల వెత లు పట్టవు. తెలంగాణ ప్రజల ప్రాతినిధ్యం లేకపోయిన తెలుగుదేశం పార్టీ అధికారా నికి రావడానికి తహతహలాడుతున్నది. ఇటువంటి పరిస్థితే ఏర్పడితే ప్రభుత్వం ఏ విధంగా నిలదొక్కుకొంటుందో వారికి తెలియాలి.

అసలు ఈ కోర్‌ కమిటీ ఏ నిర్ణయ మూ తీసుకోదట. ఏదో అధ్యయనం చేసి నివేదికను అ«ధ్యక్షునికి సమర్పిస్తుందట. కమిటీలో చర్చించే విషయాలు బయటికి పొక్కొద్దట. ఈ లోగా తెలంగాణ గురించి అనుకూలంగా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తప్పవట. కాని తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏం చేస్తారో చెప్పరు. కమిటీకి అసలు కాలపరిమితే లేదట. మరి కమిటీ పని పూర్తి చేయడానికి సరియైన సమయం ఎప్పుడు వస్తుందో? ఈ కమిటీ మరికొంత కాలయాపన చేసి చివరకు కర్ర విరగని, పాము చావని సూత్రీకర ణలు చేసినా ఆశ్చర్యపడవలసిన అవసరం ఉండదు. దానితో కథ మొదటికొస్తుంది.

ఈ పరిస్థితులలో తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం నాయకుల కర్తవ్యం ఏమిటో వారు నిర్ణయించుకోవాలి. వారిలో అనేకులు తెలంగాణ సమస్యల పట్ల అవగాహన, ప్రత్యేక రాష్ట్ర సాధన పట్ల నిబద్ధత కలవారు ఉన్నారు. వారి ప్రయత్నా లపై నీళ్లు చల్లే ఉద్దేశంతోనే కోర్‌ కమిటీ నియామకం జరిగింది. వారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తలవంచి అగ్రనాయకులుగా ఎదుగుతారా లేక వలసవాద నాయకుల ఒత్తిళ్ళకు లొంగి, రెండవ శ్రేణి నాయకులుగా మనుగడ కొనసాగిస్తారా అనేది వారి ముందున్న ప్రశ్న. వారు ఏ నిర్ణయం తీసుకున్నా, తెలంగాణ ప్రజలు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో రెండవ శ్రేణి పౌరులుగా బతకడానికి సిద్ధంగా లేరు.

Thursday, September 21, 2006

మనకు బతకడం రాదు అన్నోడు....!!!!

మనకు బతకడం రాదు అన్నోడు, మనను మోటు మనుశులన్నోడు, మన తిండి ని సూశి నవ్వినోడు, మనకు పని చేసుడు శాతకాదు అన్నోడు, మనది తెలుగే కాదన్నోడు శిగ్గు షరం లేక మనందరం ఒక్కటె కలిసే ఉందాం అంటున్నడు.
-నవీన్ ఆచారి

Sunday, September 17, 2006

Settler MP కి చెప్పుదెబ్బ లాంటి జవాబు

మర్యాదగా మాట్లాడండి రేణుకకు మధుయాష్కీ సలహా
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ సహచరుడినుద్దేశించి కాస్తంత మర్యాదగా మాట్లాడాలని కేంద్రమంత్రి రేణుకా చౌదరికి ఎంపీ మధుగౌడ్‌ యాష్కీ సలహా ఇచ్చారు. ఆయనా ఓ నాయకుడేనా? అంటూ రేణుక చేసిన వ్యాఖ్యల్ని ఆదివారమిక్కడ ఖండించారు. 'నేను కూడా ప్రజలెన్నుకున్న ప్రతినిధినే. ఆమెకు జవాబును గట్టిగా మరింత సమర్థంగా చెప్పగలను. కానీ నేను కూడా అలా మాట్లాడితే ఇక ఆమెకూ నాకూ తేడా ఏముంటుంది?' అని మధుగౌడ్‌ వ్యాఖ్యానించారు.

Saturday, September 16, 2006

గులాబి కండవాతో గెలిచామా!...సిగ్గుచేటు

గులాబి కండవాతో గెలిచామా!...సిగ్గుచేటు! సర్వే' ప్రకటనపై పరోక్షంగా ధ్వజమెత్తిన రాజగోపాల్‌

విజయవాడ, సెప్టెంబర్‌ 16 (ఆన్‌లైన్‌): సోనియాగాంధీ చేసిన పదవీ త్యాగాలు, వైఎస్‌ పాదయాత్రలతో గెలుపొందిన కాంగ్రెస్‌ నాయకులు గులాబి కండువా వేసుకుని గెలిచామనడం సిగ్గుచేటైన విషయమని విజయవాడ ఎంపి రాజగోపాల్‌ అన్నారు. విజయవాడ నగర కాంగ్రెస్‌ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా జరిగిన సభలో రాజగోపాల్‌ ఆవేశంతో మాట్లాడారు. తన సహచర ఎంపి అయిన సిద్దిపేట ఎంపి సర్వే సత్యనారాయణపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్‌ను తెలంగాణా ముద్దుబిడ్డగా వర్ణించడంతోపాటు, తాను గులాబి కండువాతో గెలిచానని'సర్వే' చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్‌ మండిపడ్డారు. ఆ మహానుభావుడు చేసిన ప్రకటన చదువుతుంటే తనకు కన్నీటి తెరలు అడ్డువచ్చాయని అన్నారు.

సొంతాగా బతకలెని మీకు సిగ్గు కుడావుందా. అంత పొడింగుగాలె ఐత్ సొంతాగా బతకండిరా తెలంగానని దొచుకొకుందా..

Wednesday, September 13, 2006

address లెనివాడు అడ్డుపదితె ఎంత అడ్డుపదకపొతె ఎంత...!!!

ప్రజలు కోరితే అడ్డుపడం :: తెలంగాణపై సీహెచ్‌.రాజేశ్వరరావు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ''సాధారణ ఎన్నికల్లో ప్రజలు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా తీర్పునిస్తే మా పార్టీ అడ్డుపడదు. ప్రత్యేక తెలంగాణను మేమేమన్నా అడ్డుకుంటామన్నామా? మెడ కోసుకుంటామన్నామా? ఆత్మహత్య చేసుకుంటామన్నామా? అయితే... ప్రత్యేక రాష్ట్రం వస్తే అన్న ఆలోచనే నా వరకు నాకు ఊహాతీతమైనది. అది ఎన్నటికీ సాధ్యం కానిది'' అని తెదేపా సీనియర్‌ నేత సీహెచ్‌.రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎవరికి వారు తమ కోపతాపాల కోసం, ట్రిక్కులు, గిమ్మిక్కుల కోసం సవాళ్లు చేయడం, రాజీనామాలు చేసుకోవటం అన్న వాటికి ప్రజాస్వామ్యంలో విలువ లేదని బుధవారమిక్కడ చెప్పారు. ఉపఎన్నిక ఫలితం తెలంగాణకు రిఫరెండమ్‌ కాదన్నారు. ఒకవేళ కేసీఆర్‌ రాజీనామాతో ఉప ఎన్నిక జరిగితే తెదేపా తరఫున అభ్యర్థిని నిలబెడతామని చెప్పారు

తెలంగాణలొ address లెని తెదేపా అడ్డుపదితె ఎంత అడ్డుపదకపొతె ఎంత,తెదేపా(TDP) అంటె తెలంగాణ ద్రొహుల పార్టి అని మారొసారి నిరుపించుకుంటుంది.

రైతుల ఆత్మహత్యలపై సిఎం అంగీకారం

హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అంగీకరించారు. ఈ విషయంలో నిజాలను దాచిపెట్టకుండా తాము పారదర్శకతతో వ్యవహరిస్తున్నామని ఆయన చెప్పారు. ఆత్మహత్యలపై ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 303 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయని, తాము అధికారంలోకి వచ్చాక 1501 మంది రైతులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వ్యవసాయదారులకు రోజుకు ఏడు గంటలసేపు విద్యుత్‌ ఇవ్వడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా విద్యుత్‌ సబ్‌ స్టేషన్లపై దాడి చేస్తున్న రైతులను ఆయన విమర్శించారు. వారు రాజకీయ రైతులని ఆయన అభివర్ణించారు.

Hats off to Madhu తెలంగాణాపై ఆత్మవంచన చేసుకోను

తెలంగాణాపై ఆత్మవంచన చేసుకోను

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆన్‌లైన్‌): 'ఎవరికో భయ పడి, ఏదో ఆశించి తెలంగాణపై మౌనంగా ఉండే ప్రసక్తిలేదు. అది ఆత్మవంచనే అవుతుంది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్న భయంలేదు నాకు. గత ఎన్నికల్లో తెలంగాణ హామీ ఇచ్చి గెలిచాము. ఆ బాధ్యతను నిలబెట్టుకోవాలన్నదే నా ఆశయం. ఈ గడ్డపై పుట్టినందుకు తెలంగాణ తల్లి రుణం తీర్చుకుం టాను' అని నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపి మధుగౌడ్‌ యాస్కీ స్పష్టం చేశారు. మంగళవారం బషీర్‌బాగ్‌ సురవరం ప్రతాప రెడ్డి ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఎన్నికలకు ముందు నేను రాజకీయాలకు కొత్త. పోతిరెడ్డి పాడు వివాదం ఏమిటో చెప్పమని అప్పటి టిఆర్‌సిసి కన్వీనర్‌ చిన్నారెడ్డిని అడిగాను. పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణకు నష్టం. దీనిని ప్రతిఘటించాలని ఆయన చెప్పారు. అదే చిన్నారెడ్డి ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారో మీకు తెలుసు. మావాళ్లు (కాంగ్రెస్‌ నాయకులు) ఎన్నికలకు ముందు ఏమి మాట్లాడారో, ఇప్పుడెలా మాటమార్చుతున్నారో 'ఆంధ్రజ్యోతి' దినపత్రికలో ఇటీవల వరుసగా ప్రచురించిన విషయం మీకు తెలుసు. ఎందుకిలా జరుగుతున్నదో మీకు తెలుసు. నేను మాత్రం ఎవరికో భయపడి, ఏదో ఆశించి మౌనంగా ఉండబోను' అని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.

'అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 400 కోట్ల రూపాయల పనులు చేశాం. అక్కడ తెలుగుదేశానికి అధికంగా ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో కూడా అలాగే జరిగింది. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటు న్నారో తెలియడం లేదా?' అని ఆయన ప్రశ్నించారు. 'కెసిఆర్‌ రాజీనామా చేసిన తర్వాత పార్లమెంటులో నరేంద్ర ప్రసంగిస్తుంటే ఆయనపై ఎదురుదాడి చేయాలని సిద్ధమవు తుంటే నేను సిద్ధిపేట ఎంపి సర్వే సత్యనారాయణను అడి గాను- మీరు తెలంగాణను కోరుకుంటున్నారా లేదా అని. లేదు నాకు తెలంగాణ కావాలనే ఉందన్నారు ఆయన. మరి అటువంటప్పుడు తెలంగాణ కోసం ఎవరో ఒకరు మాట్లాడు తుంటే మనమెందుకు అడ్డుకోవాలని ప్రశ్నించాను' అని మధుగౌడ్‌ చెప్పారు. పిసిసి అధ్యక్షుడు కేశవరావుతో పాటు తెలంగాణ ప్రాంత ఎంపీలను, ఎమ్మెల్యేలను తాను స్వయంగా అడిగానని, అందరూ తెలంగాణ కావాలని అంటూనే పదవుల కోసం తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్‌లో నాడు చెన్నారెడ్డి, నేడు చిన్నారెడ్డి వంటి వాళ్లు ఎప్పుడూ ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎంపీలు అయి ఉండి తెలంగాణ కోసం ఎందుకు మాట్లాడరని అడిగితే, 'నేను ఇప్పుడిప్పుడే సంపాదించుకుంటున్నానని, భూములు కొనుక్కుంటున్నానని నన్ను వదిలేయండి' అని ఒక ఎంపీ తప్పించుకున్నారని మధుగౌడ్‌ వెల్లడించారు. తెలం గాణలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉండాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని, టిఆర్‌ఎస్‌ను బలహీనపరిస్తే అది కాంగ్రెస్‌కే నష్టమని తాను సోనియాగాంధీకి, రాహుల్‌గాంధీ లకు చెప్పానని ఆయన తెలిపారు. 'తెలంగాణపై ఇక చావో బతుకో తేల్చుకోవాల్సిన సమయం ఇది. తెలంగాణలోని కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై బహిరంగంగా మాట్లాడాలి' అని ఆయన కోరారు. తాను కాంగ్రెస్‌లో ఉంటూనే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడతానని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాలలోనే సత్వరాభివృద్ధి సాధ్యమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటేక్‌ సింగ్‌ అహ్లూవాలియా కూడా చెప్పారని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌లో మధుయాస్కీ కలకలం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (ఆన్‌లైన్‌) ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను బహిరంగ పరుస్తూనే.. ఈ ప్రాంత నేతలపై నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యుడు మధు యాస్కీ గౌడ్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా టిఆర్‌సిసిసి కన్వీనర్‌ జి.చిన్నారెడ్డిపై ఆయన చేసిన విమర్శలు కాంగ్రెస్‌ లో కలకలాన్ని రేపుతున్నాయి. ఇప్పటివరకూ హైదరాబాద్‌ బ్రదర్స్‌ మర్రి శశిధర్‌రెడ్డి, పి.జనార్ధన్‌రెడ్డిలు మాత్ర మే పలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ అధిష్టానానికి నివేదికలు పంపుతూ కంట్లో నలుసుగా ఉన్నా రు. ఇప్పుడు మధుయాస్కీ గౌడ్‌ కూడా వారికి తోడయ్యా రు. మధు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాప్రతినిధులు బహిరంగంగా ఖండించలేకపోతున్నారు.

ఇప్పుడు తామేం మాట్లాడినా తెలంగాణకు వ్యతిరేకులుగా అపప్రదను మూటగట్టుకోవా ల్సి వస్తుందని వారు భయపడుతున్నారు. అమెరికాలో న్యాయవాద వృత్తిని చేపట్టి ఆర్థికంగా స్థిరపడిన మధు యాస్కీగౌడ్‌ 2004లో జరిగిన ఎన్నికల్లో అప్పటి పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ ఆశీస్సులతో నిజామాబాద్‌ పార్ల మెంటు స్థానం నుంచి కాంగ్రెస్‌పార్టీ తరఫున ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. మృదుస్వభా విగా కన్పించే మధుయాస్కీగౌడ్‌లో ప్రాంతీయాభిమానం మెండుగా కన్పిస్తుంది. తెలంగాణ ప్రాంత రైతాంగానికి నష్టం కలిగించే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో కేసు వేసి ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇటీవల తెలంగాణ అంశం చర్చకు వచ్చినప్పుడు ప్రజల ఆకాంక్షలు అధికంగా ఉన్నాయని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి వివరించారు.

ఈ సందర్భంలో ఆమె పిసిసి అధ్యక్షుడు కె.కేశవరావును ఉద్దే శించి చేసిన వ్యాఖ్యలను బహిర్గతం చేశారు. ఆ వ్యాఖ్యల ను పిసిసి అధ్యక్షుడు తోసి పుచ్చలేదు. పైగా అవన్నీ వాస్తవాలేనని సమర్థించారు. కానీ మంగళవారం చిన్నారెడ్డిపై మధు చేసిన వ్యాఖ్యలను కేకే సీరియస్‌గా తీసుకున్నారు. 'చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పుడు మిత్రుడు మధుయాస్కీ భారత దేశంలోనూ, రాష్ట్రంలో నూ, ఈ ప్రాంతంలోనూ లేరు... వాస్తవాలు తెలుసుకుంటే మంచిది' అని కేకే ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారెడ్డి కూడా మధు వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, ఈ వ్యాఖ్యలను ఖండించాల్సిందిగా.. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను కొందరు కోరారు. వారి సూచనను ఆ ఎమ్మెల్యే పాటించలేదు. పైగా.. ఎన్నికల సమయంలో పార్టీలోకి తీసుకువచ్చి.. పార్లమెంటు టిక్కెట్టును ఇచ్చిన వారినే ఖండించమని చెప్పండని ఆ ఎమ్మెల్యే ఖరాఖండీగా చెప్పారు. రాజీనామాలు, ఉపసంహరణల నేపథ్యంలో ఇప్పుడు తెలం గాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతల్లో ప్రత్యేక తెలంగాణ అంశంపై మాట్లాడాలో.. వద్దో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొంది.

మధుయాస్కీని చుసి మిగితా కాంగ్రెస్ వాల్లు శెరం తెచ్హుకొవాలి

Friday, August 25, 2006

ఎంటొ ఈ యదవలు చేసిన Developmenutu ??

గుంటురు ఎంపి రాయపాటి సాంబశివరావు మటలొ ఆంధ్ర ప్రజలె హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అభివృద్దికి దొహదపద్దారట. ఎంటొ ఈ యదవలు చేసిన అభివృద్ది, Andhra mess lu తపితె విల్లు చెసింది ఎమి లేదు. ఆంద్ర ప్రజలు పొట్ట కుటి కొసం హైదరాబాద్ కు వచ్ఛి బతుకు తున్నారని రాయపాటి గమనిస్తే మంచిది లెకపొతె 1969 పట్టిన గతే పడుత్నుది.

http://thatstelugu.oneindia.in/talk2006/politics/cong-provokes-coastal-leaders.html

Thursday, August 17, 2006

Telangana Kanneeti Katha

It describes the plight of Telangana area in Andhrapradesh, India.

Even after 50 years of independence, people die because of hunger. Politicians claim India is shining ang it is almost developed country.

బంగారు బతుకమ్మ ఒక జ్నాపికంలా మిగిలిపోనున్నదా ?

బతుకమ్మను బతికించే ప్రయత్నం చేస్తున్న - భరత్ భుషణ్